హరికధ యక్షగానం నుండి ఆవిర్భవించిందని చరిత్రకారుల అభిప్రాయం.ఈ కళారూపానికి ఆధ్యుడు శ్రీ ఆదిభట్ల నారాయణదాసుగారు.ఆ తరువాత ఎందరో ఈ కళారూపాన్ని అభివృద్ది చేసారు.హరి అనగా విష్ణుమూర్తి యొక్క కధని చేప్పే దానిని హరి కధాని అంటారు.ఈ కళారూపం ప్రారంభమైన తొలొ నాళ్ళలోహరి గురించి ఎక్కువగా గానం చేసేవారు కావున దీనికి ఆ పేరు వచ్చిందని చెబుతారు.కాలక్రమేణా ఈ హరికధల్లో కేవలం విష్ణు కధలనే కాక ఇతర దేవుళ్ళ కధలను కూడా గానం చెయ్యడం జరుగుతుంది.
హరి కధలను ముఖ్యంగా గ్రామ సీమల్లో ఉత్సవాలు జరిగినపూడో లేక ఊరు ప్రజల్లో అద్యాత్మిక చింతనను పెంపొందించెందుకు వీటిని గానం చేసేవారు.దీనిని సామాన్య ప్రజలు హరికధా కాలక్షేపం అని కూడా అంటారు. కధకుడు చెప్పే మహా భారత,భాగవాది కధలను ప్రజలు ఎంతో ఏకాగ్రతతో వింటారు.కేవలం భక్తి కధలే కాక మద్య మద్యలో మంచి విషయాలను కూడా కధకుడు చెబుతాడు.
హరి కధ చేప్పే కళాకారుడు పట్టు పంచె కాళ్ళకి గజ్జెలు ధరించి,నుదుటున నామం పెట్టుకుని,మెళ్ళో మాల,చేతిలో చిరతలుతో ఈ హరి కధని ఆలపిస్తాడు.కధకుడు చిరతలను లయ బద్దంగా ఆడిస్తూ కధని గానం చేస్తూంటే మృదంగం,వయోలిన్,హర్మొనియంలు అతనికి వాయిద్య సహకారాన్ని అందిస్తాయి.
ఈ హరికధ ఇదివరకూ బాగా ప్రాచూర్యంలో ఉన్నా కాలక్రమేణా టీవి,సినిమాలు రావడంతో వీటికి ఆదరణ తగ్గింది.