ఊరూరా తిరుగుతూ వారి వారి నామ గోత్రాలను చేప్పేవారిని పిచ్చికుంట్లవారు అని అంటారు.వీరి గురించి ప్రాచీన కాలం నుండే అనేక గ్రంధాల్లో ప్రస్తావన ఉంది.వీరు గ్రామగ్రామాలు తిరుగుతూ వారి గోత్రనామాలు చెబుతూ వారిచ్చే పారితోషికంతో జీవన భృతిని కొనసాగిస్తుంటారు.వీరు శైవ మతస్తులు.శ్రీశైల మల్లిఖార్జునున్ని పూజిస్తారు.
వీరు ఊరూర తిరుగుతూ గోత్రనామాలేకాక ఆయా ప్రాంతాలకు చెందిన వీర గాధలను కూడా చెబుతుంటారు.వీరు రాయలసీమ ప్రాంతంలో రెడ్ల గురించి చెబుతుండగా,కోస్తా ప్రాంతంలో పల్నాటి వీరగాధని చెబుతారు.పల్నాటి వీర గాధని చేప్పేటపుడు వీరు కుడిచేతిలో ఖడ్గం ఎడమ చేతిలో డాలు ధరించి ఉద్రేకపూర్వకంగా కధని చెబుతారు.కధ చెబుతుండగా పక్కన ఇద్దరు దానికి పంబజోడు వాయించగా మరొక వ్యక్తి తోలుతిత్తిని ఊదుతాడు.