యక్షగానం అనేది తెలుగునాట అతి ప్రాచీనమైన కళల్లో ఒకటీ.ఈ కళను జక్కు కులం వారు ప్రదర్శించే వారని చరిత్రకారుల అభిప్రాయం.ఈ కళను తెలుగులో జక్కుపాట అని అంటుండగా సంస్కృతంలో యక్షగానమని అంటారు.యక్షగానం అనే పదాన్ని తొలుత శ్రీనాధ మహకవి తను రచించిన భిమేశ్వర పూరాణంలో ప్రస్తావించాడు.
ఆ తర్వాత ఈ కళ గురించి పాల్కుర్కి సోమనాధుడు తదితర కవులు తమ రచనల్లో పేర్కొన్నారు.జంగం కధ,హరి కధ మొదలైన కళా రూపాలకు యక్షగానం మూలముగా చెబుతారు.తొలుత ఈ కళా రూపకాన్ని ఒక కళాకారుడే అందరి పాత్రలను ప్రదర్శించగా ఆ తర్వత పరిమాణ క్రమంలో అన్ని పాత్రలకు వివిధ కళాకారులౌ ప్రదర్శించడం ఆరంభమయ్యింది.యక్షగానంలో పాటకు నృత్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది.ఈ కళారూపకంలో ఎక్కువగా పురాణ గాధలను వినిపిస్తారు.దీనిలో కధకుడు కధని వినిపిస్తుండగా వెనుక వాయిద్యం వినపడుతుంది.