ఆంధ్రా ప్రాంతంలో ఏదైనా జాతర గానీ,సంబరాలు గానీ జరిగినపుడు బుట్టబొమ్మలు తప్పనిసరిగా దర్శనమిస్తాయి.బుట్టలు తయారు చేసే వెదురు బద్దలతో వీటిని తయారు చేస్తారు.కావున వీటికి ఆ పేరు వచ్చింది.అంతే కాక కిందకి వచ్చే సరికి వీటి ఆకారం బుట్టను పొలి ఉంటుంది.
చాలా ఎత్తుగా అకర్షీణీయంగ ఉండే ఈ బొమ్మలు లోపల డొల్లగా ఉంటుంది.ఈ బొమ్మల లోపల నృత్యకారుడు దూరి వీటిని డబ్బాల శబ్దానికి అనుగుణంగా లయ బద్దంగా ఆడించును.నృత్యకారుడికి చూచుటకు బొమ్మ మద్యభాగంలో చిన్న రంద్రాలు ఉండును.పెళ్ళి కుమారుడు,పెళ్ళి కూమార్తె,సీతాదేవి,శ్రీరాముడు,వినాయకుడు తదితర రూపాల్లో బొమ్మలు ఉంటాయి.