ప్రతి తెలుగువాడు మన నృత్యం అని గర్వంగా చెప్పుకోవలసిన నృత్యం కూచిపూడి నృత్యం.ఇది కళాపిపాసులను మంత్ర ముగ్దులను చేస్తుంది.ప్రపంచంలో ఎ మూలన ఎవేదికపైన ఈ నృత్య ప్రదర్శన జరిగినా కళాకారులకు ప్రేక్షకులు చప్పట్లతో నిరాజనం పలుకుతారు. అంతటి విశిష్టత కలిగిన నృత్యం మన కూచిపూడి.
ఈ నృత్యం మన కృష్ణా జిల్లాలోని కూచిపూడి అనేగ్రామంలో ఉదయించింది.ఆ గ్రామం పేరు మిదే దినికి కూచిపూడి నృత్యం అనే పేరు వచ్చింది.ప్రాచీనకాలం నుండి ఇది ఉన్నా అంతగా ప్రాచుర్యం పొందలేదు.కేవలం దీనిని దేవాలయాల్లో మగవారు మాత్రమే ప్రదర్శించేవారు.అయితే 15వ శతాబ్ది కాలంలో సిద్దేంద్ర యోగి కొన్ని మార్పులు చేసి ఆడవారు ఈ నృత్యాన్ని చెయ్యవచ్చని చాటి చెప్పారు.ఇంకా మరెందరో మహనుభావులు దీనీమిద మమకారంతో ఈ నృత్యం అభివృద్ధికి తమ వంతు సాయం చేసారు. కూచిపూడి నృత్యంలో కళాకారులు పాదాలను లయబద్దంగా కదుపుతూ,కళ్లలో హవభావాలను వ్యక్తం చేస్తూ,అనేక భంగిమలతో ఈ నాట్యాన్ని ప్రదర్శిస్తారు.కూచిపూడి నృత్య ప్రదర్శన విఘ్నేశ్వరుని స్తుతి,సరస్వతి స్తుతి,లక్ష్మి,పరాశక్తి స్తుతులతో మొదలవుతుంది.ఈ నృత్యంలో అనేక రకాల ప్రదర్శనలు ఇస్తారు.ఉదాహరణకు సత్యభామను అనుకరిస్తూ భామనే సత్యభామనే అంటూ చేసేదాన్ని భామాకలాపం అంటారు. ఇత్తడి పళ్ళెంపై రెండు పాదాలు అనించి చేసే నృత్యాన్ని తరంగం అంటారు.అర్ధనారీశ్వరమా,శాంకుంతలము,యిద్దమ-శాంతి,నట్టువాగం ఇలా ఎన్నో ఉన్నాయి.
|