మన ఆంధ్రప్రదేశ్ లో లోపుల్లారెడ్డి నేతి మిఠాయిలు అంటే తెలియని వారెవరూ ఉండరంటే అతిశయోక్తిలేదేమో.. అంతగా వీరు తయారు చేసే మిఠాయిలు ప్రాచుర్యం పొందాయి.కర్నూలు జిల్లా గోకవరం గ్రామానికి చెందిన జి. పుల్లారెడ్డి 1948లో కర్నూలులో మిఠాయిల దుకాణాన్ని ప్రాంభించారు.ఆ ప్రాంతంలో పుల్లారెడ్డి మిఠాయిలకు మంచి గుర్తింపు రావడంతో తన వ్యాపారాన్ని హైదరాబాదు సహా మరిన్ని ప్రాంతాలకు విస్తరించారు.పుల్లారెడ్డి మిఠాయి దుకాణాలలో కోవా, బూందీ లడ్డు లకు మంచి ప్రాముఖ్యం కలదు.
|