పొడవాటి మెలికలు తిరిగిన కొమ్ములు కలిగి వివిధ వర్ణపు మచ్చలు కలిగి అందంగా కనిపించే జంతువు కృష్ణజింక.దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర జంతువుగా గుర్తించింది.దీని శాస్త్రియనామం ఏంటిలోప్ సెర్వికాప్రా.ఇది ఎక్కువగా భారతదెశంలొని పచ్చికబయళ్ళు,విశాలమైదానాలు,చిట్టి అడువుల్లో నివసిస్తాయి.
ఇవి ఎక్కువగా గుంపులు గుంపులుగా సంచరిస్తాయి.ఒకో గుంపుకు ఇంచు మించు 18నుండి20 వరకూ జింకలు ఉంటాయి.ఈ జింకలు శాకాహరులు ఎక్కువగా పచ్చగడ్డి,పండ్లు మొదలైనవి ఆహరంగా తీసుకుంటాయి.కృష్ణజింకలు వేగంగా కూడా పరిగెత్త గలవు.వీటిలో మగజింకలకు చర్మం మీద మచ్చలతో కొమ్ములు ఉంటే ఆడజింకలకు కొమ్ములు లేకుండా లేత గోధుమ రంగులో ఉంటాయి.వీటి గురించి మన హిందూ పురాణాల్లో కూడా ప్రస్తావన ఉంది.చంద్రుడు వాహనంగా కృష్ణ జింకను వాడేవారట.
అయితే ప్రస్తుతం అంతరించి పోతున్న జంతువుల జాబితాలో ఇది కూడా వచ్చి చేరింది.దీని మాంసం,చర్మం కొసం వేటాడటంతో వీటిమనుగడకు ముప్పు ఏర్పడింది.వన్యప్రాణి సమ్రక్షణ చట్టం ప్రకారం వీటిని వేటాడటం చట్టరిత్యా నేరం.
|