తనకవితా ప్రతిభతో ఆంధ్ర ప్రజలను మంత్రముగ్దులను చేసిన కవి పోతనామాత్యుడు.పోతన 15వ శతాబ్ద పూర్వభాగమ్నందు వరంగల్లు జిల్లాలోని బమ్మెర అను గ్రామంలో లక్కమాంబ,కేసవ అను దంపతులకు జన్మించాడు.
శ్రీరామచంద్రుని ఆనతి మేరకు వ్యాసుడు సంస్కృతంలో రచించిన భాగవతాన్ని ఆంధ్రమహభాగవతము అను పేర తెనిగించాడు.పోతన పద్యాలు పండిత,పామర తారతమ్యం లేకుండా ప్రజల నాలుకలపై నాట్యం చేస్తాయి. సజీవపాత్ర చీత్రణ,అద్భుత కధాకదన శిల్పం,భక్తి భావనలు లోకోత్తర భావుకత శక్తి వంటి కవితా లక్షణాలు ఆంధ్రసాహిత్యంలో పోతనను చీరంజీవిని చేసాయి.పోతనకు సహజపాండిత్యుడు అను బిరుదము కలదు.పోతన భాగవతమే కాక వీరభద్రవిజయము,భోగినిదండకము,నారాయణశతకము అనే రచనలు చేసాడు. ఈయన రచించిన భోగినిదండకాన్ని సింగభూపాలునికి అంకితమిచ్చాడు. పేదరికంలో ఉన్నా ఎనాడు చేయిజాపని అభిమాన వంతుడు.
|